మూడో భర్త మృతి పట్ల నటి సంతాపం

వనిత విజయ్ కుమార్ జీవితంలో మరో విషాధం చోటు చేసుకుంది. ఆమె మూడో భర్త పీటర్ పాల్ మృతిచెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు పీటర్ పాల్. పరిస్థితి మరింత విషమించడంతో మృతిచెందాడు. భర్త…

వనిత విజయ్ కుమార్ జీవితంలో మరో విషాధం చోటు చేసుకుంది. ఆమె మూడో భర్త పీటర్ పాల్ మృతిచెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు పీటర్ పాల్. పరిస్థితి మరింత విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపట్ల వనిత విజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేసింది.

“మీరు ఎదుర్కొంటున్న చెడ్డ వ్యక్తులు, గాయాలతో మీరు ఎంత పోరాటం చేశారో నాకు తెలుసు. ఈ ప్రపంచంలోంచి మీరు వెళ్లిపోయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కచ్చితంగా మీరు ఓ మంచి స్థానంలో ఉన్నారని నాకు తెలుసు, అక్కడైనా సంతోషంగా ఉండండి” అంటూ పోస్ట్ పెట్టింది.

వనిత విజయ్ కుమార్, పీటర్ పాల్ విడిపోయారు. 2020 జూన్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే హనీమూన్ నుంచే వీళ్ల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. పీటర్ పాల్ పచ్చి తాగుబోతు అనే విషయాన్ని దాచిపెట్టాడని వనిత ఆరోపించింది. హనీమూన్ టైమ్ తో గోవాలో తెగ తాగాడని, చెన్నై వచ్చేవరకు తాగుతూనే ఉన్నాని, ఇంట్లోకి తీసుకురావడానికి మనుషులు కావాల్సి వచ్చిందని వాపోయింది.ఆ వెంటనే పీటర్ కు దూరమైంది.

అదే టైమ్ లో పీటర్ పాల్ అసలు భార్య మీడియాకెక్కింది. తనకు విడాకులివ్వకుండా, వనితను పీటర్ పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. దానిపై పీటర్ స్పందించాడు. తన భార్యకు విడాకులిచ్చి, మరోసారి వనితను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. కానీ అసలు భార్య విడాకులు ఇవ్వనని మొండికేసింది. దీంతో పీటర్ పరిస్థితి మొదటికొచ్చింది.

తాగుడు వల్లనే పీటర్ ఆరోగ్యం క్షీణించిందని చెబుతారు తెలిసినవాళ్లు. కొన్ని రోజుల కిందట అతడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే చెన్నైలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పట్నుంచి హాస్పిటల్ లోనే ఉంటున్న పీటర్, పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.

వనిత విజయ్ కుమార్ కు వైవాహిక బంధాలు కలిసిరాలేదు. ఎలాగోలా పీటర్ దగ్గరవుతాడని అంతా భావించారు. అంతలోనే అతడు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ నటి, సీనియర్ నరేష్ హీరోగా నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తోంది.