Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాశీఖన్నా మళ్లీ పాడేసింది

రాశీఖన్నా మళ్లీ పాడేసింది

అందాలనటి రాశీఖన్నా కేవలం మంచి నటి మాత్రమే కాదు. మంచి గాయని కూడా. తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాదు, తెలుగు పాటలు అనేకం సదా హమ్ చేస్తూనే వుంటుంది. ఈ సరదాతోనే గతంలో కొన్ని సినిమాల్లో పాటలు పాడింది.

హీరోయిన్ గా సినిమాలు ఎలా వున్నా, పాటల పాడే చాన్స్ లు వస్తే వదులుకోదు. అసలు ఆ అవకాశం ఎవరు ఇస్తారో అని రాశీఖన్నా చూస్తూ వుంటుంది.

లేటెస్ట్ గా అలాంటి అవకాశం మళ్లీ వచ్చింది. మారుతి డైరక్షన్ లో సాయి తేజ్ హీరోగా తయారువుతున్న సినిమాలో రాశీఖన్నా తన పాట తనే పాడేసింది. ఈ సినిమాలో రాశీఖన్నానే హీరోయిన్. అందువల్ల ఆమెపై చిత్రీకరించే పాటను ఆమె పాడేసినట్లే కదా?

థమన్ మ్యూజిక్ డైరక్టర్. థమన్ మ్యూజిక్ డైరక్టర్ అయిన కొత్తలో చాలా మంది చేత ప్రత్యేకంగా పాటలు పాడించేసాడు. ఇది కూడా కొత్త కాదు. గతంలో జవాన్ సినిమాలో థమన్ ఓ పాటను రాశీ చేత పాడించాడు. ఇప్పుడు మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?