రెండు బ్యానర్లు- ఒక దర్శకుడు

అడ్వాన్స్ లు తీసుకుంటే అదే సమస్య. కీలకమైన టైమ్ లో అడ్డం పడతాయి. ఎర్లీ డేస్ లో అడ్వాన్స్ లు తీసుకోకుంటే సమస్య. అది ఇంకో తరహా ప్రోబ్లెమ్. దర్శకుడు సుజిత్ కు ఇప్పుడు…

అడ్వాన్స్ లు తీసుకుంటే అదే సమస్య. కీలకమైన టైమ్ లో అడ్డం పడతాయి. ఎర్లీ డేస్ లో అడ్వాన్స్ లు తీసుకోకుంటే సమస్య. అది ఇంకో తరహా ప్రోబ్లెమ్. దర్శకుడు సుజిత్ కు ఇప్పుడు ఇదే సమస్య అవుతోందని తెలుస్తోంది.

సుజిత్ దగ్గర పీపుల్స్ మీడియా అడ్వాన్స్ వుంది. వాళ్లకు సినిమా చేయాలి. ఓజి సినిమాను డివివి బ్యానర్ కు చేయాలనుకున్నపుడు అదే సమస్య అయింది. అయితే అక్కడ ఆ ప్రాజెక్ట్ వెనుక పవన్, త్రివిక్రమ్ వున్నారు కనుక, పీపుల్స్ మీడియాకు నచ్చ చెప్పారు. వాళ్లు కూడా అయిష్టంగానైనా ఓకె అనక తప్పలేదు.

ఇప్పుడు ఏమయింది అంటే సుజిత్- నాని కాంబినేషన్ లో ఓ సినిమా అనుకున్నారు నిర్మాత దానయ్య. ఓజి సినిమా ఎలాగూ లేట్ అవుతోంది. దాన్ని సగంలో అలా వుంచి హీరో నాని- సుజిత్ కాంబినేషన్ లో సినిమా కానిచ్చేయాలి అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అబేయన్స్ లో పడింది. బడ్జెట్ లెక్కలు సెట్ కావడం లేదని టాక్ బయటకు వచ్చింది.

ఈ విషయం తెలిసి పీపుల్స్ మీడియా ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమకు ఎలాగూ ఓ సినిమా చేయాలి కనుక ఈ సినిమా తమకు చేయమని పీపుల్స్ మీడియా అడుగుతోందని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. ఇవి ఎంత వరకు నిజమో కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. ఓజి సినిమా అయిన తరువాత కానీ డివివి బ్యానర్ నుంచి సుజిత్ బయటకు రాలేదు. అక్కడే మరో సినిమా అంటే వేరు. బయటకు రావడం అంటే వేరు.

అందువల్ల సుజిత్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి, దసరా దర్శకుడు లేదా బలగం దర్శకుడితో సినిమా చేయాలని హీరో నాని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.