Advertisement

Advertisement


Home > Movies - Movie News

రేణుదేశాయ్ రీఎంట్రీ ఫిక్స్

రేణుదేశాయ్ రీఎంట్రీ ఫిక్స్

పవన్ తో విడిపోయిన తర్వాత పూణె వెళ్లిపోయారు రేణుదేశాయ్. పూర్తిగా పిల్లలపైనే దృష్టిపెట్టారు. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రేణుదేశాయ్ ఇప్పుడు మరోసారి వెండితెరపైకి రాబోతున్నారు. ఆమె రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. బెల్లంకొండ సినిమాతో ఆమె మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నారు.

త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేయబోతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన ఓ గజదొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించనున్నారు రేణుదేశాయ్. ఈ సినిమాకు మాటలు రాస్తున్న సాయిమాధవ్ బుర్రా ఈ విషయాన్ని నిర్థారించారు. సినిమాలో రేణుదేశాయ్ పాత్ర చాలా బాగుంటుందంటున్నారాయన.

మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశంతో దర్శకత్వం వైపు అడుగులు వేశారు రేణుదేశాయ్. మరాఠీలో ఓ సినిమా చేశారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత కొన్ని కవితలు రాశారు. వాటికి కూడా అంతగా ప్రాచుర్యం దక్కలేదు. దీంతో మరోసారి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు రేణు.

నిజానికి ఈ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చాన్నాళ్ల కిందటే వచ్చాయి. అవి ఇప్పుడు నిజమయ్యాయి. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆమె పాల్గొంటుందంటూ కూడా వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె గతంలోనే క్లారిటీ ఇచ్చారు.. తను బిగ్ బాస్ లో పాల్గొననని, అవకాశం ఇస్తే బిగ్ బాస్ గా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. 

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?