మేం క‌రోనాబారిన ప‌డ్డాంః సీనియ‌ర్ న‌టి

తాను, త‌న కుమారుడు క‌రోనా బారిన ప‌డిన‌ట్టు సీనియ‌ర్ న‌టి, ద‌ర్శ‌కురాలు రేణుదేశాయ్ పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణుదేశాయ్‌…తాజాగా మ‌హ‌మ్మారికి గురైన సంగతిని అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో…

తాను, త‌న కుమారుడు క‌రోనా బారిన ప‌డిన‌ట్టు సీనియ‌ర్ న‌టి, ద‌ర్శ‌కురాలు రేణుదేశాయ్ పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణుదేశాయ్‌…తాజాగా మ‌హ‌మ్మారికి గురైన సంగతిని అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ మేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

“అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డాం. మేము ఇద్దరం ఇప్పుడు కోలుకుంటున్నాం. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కోవిడ్ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి.. మాస్కులు ధరించండి.. జాగ్రత్తగా ఉండండి. నేను గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. అకీరాకు మాత్రం ఒకటే డోస్ అయ్యింది. రెండో డోస్ వ్యాక్సిన్ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది” అంటూ రేణూ దేశాయ్ వివ‌రించారు.

ఇప్ప‌టికే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు ప్ర‌ముఖులు కరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌మ‌కు తాముగానే వెల్ల‌డిస్తూ జ‌నాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ వేయించుకోవాల‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. 

థ‌ర్డ్ వేవ్ విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నేది అంద‌రి మాట‌. మ‌హ‌మ్మారి బారిన ప‌డిన త‌ర్వాత ఆందోళ‌న చెందేకంటే, దాని బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మ‌న‌ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం.