శ‌త్రువు నుంచి ప‌వ‌న్ సినిమా ట్రైల‌ర్‌కు అత్యుత్త‌మ ప్ర‌శంస‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే నాడు ఆయ‌న శ‌త్రువు నుంచి సానుకూల ట్వీట్ రావ‌డం విశేషం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాంగోపాల్‌వ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓ రేంజ్‌లో విమ‌ర్శిస్తుండ‌డం తెలిసిందే. రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్…

ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే నాడు ఆయ‌న శ‌త్రువు నుంచి సానుకూల ట్వీట్ రావ‌డం విశేషం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాంగోపాల్‌వ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓ రేంజ్‌లో విమ‌ర్శిస్తుండ‌డం తెలిసిందే. రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పంథాపై ఆర్జీవీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వైఖ‌రిని వెల్ల‌డిస్తుంటారు. ముఖ్యంగా క‌మ్మోళ్ల‌కు కాపుల‌ను తాక‌ట్టు పెట్టార‌ని ఆర్జీవీ ఘాటుగా ట్వీట్ చేయ‌డం తెలిసిందే. అలాంటి ఆర్జీవీ నుంచి ప‌వ‌న్ సినిమా ట్రైల‌ర్‌కు ఊహించ‌ని విధంగా ప్ర‌శంస రావ‌డం విశేషం.

 ర్శకుడు సుజిత్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG)లో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం గ్లింప్స్‌ని తాజాగా ప‌వ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని విడుదల చేయ‌డం విశేషం. ప‌వ‌న్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెబుతూనే దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తిక‌రంగా చేసిన ట్వీట్ ఏంటంటే…

'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది. ఇప్పటి వరకు నేను చూసిన పీకే ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో' అంటూ ట్వీట్ చేశారు.

'ప‌దేళ్ల క్రితం బాంబేలో వ‌చ్చిన తుపాను గుర్తుందా? అది మ‌ట్టి, చెట్ల‌తో పాటు, స‌గం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు న‌రికిన మ‌నుషుల ర‌క్తాన్ని మాత్రం ఇప్ప‌టికీ ఏ తుపాను క‌డ‌గ‌లేక‌పోయింది. అలాంటి వాడు మ‌ళ్లీ తిరిగి వ‌స్తున్నాడు అంటే..' అంటూ పవన్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డాన్ని చూడొచ్చు. ఆర్జీవీకే న‌చ్చిందంటే, ఇక ఆయ‌న అభిమానుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ‌కీయంగా ప‌వ‌న్‌ను ఆర్జీవీ విమ‌ర్శిస్తుంటార‌నే కోపం అభిమానుల్లో వుంది. అయితే త‌మ అభిమాన హీరో సినిమా ట్రైల‌ర్‌పై ఆర్జీవీ అత్తుత్త‌మ కామెంట్ చేయ‌డంతో ఆ కిక్కే వేర‌బ్బా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.