భోళాశంకర్.. కొత్త డౌట్స్ రేకెత్తించిన దర్శకుడు

ఏదైనా అంశాన్ని ఎత్తుకుంటే, కొన్ని రోజుల పాటు దానిపై ట్వీట్స్ వేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. ఆ ఇష్యూను చీల్చిచెండాడే వరకు నిద్రపోడు ఈ దర్శకుడు. నిన్నట్నుంచి ఈ దర్శకుడు భోళాశంకర్ ను…

ఏదైనా అంశాన్ని ఎత్తుకుంటే, కొన్ని రోజుల పాటు దానిపై ట్వీట్స్ వేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. ఆ ఇష్యూను చీల్చిచెండాడే వరకు నిద్రపోడు ఈ దర్శకుడు. నిన్నట్నుంచి ఈ దర్శకుడు భోళాశంకర్ ను ఎత్తుకున్నాడు. పరోక్షంగా బ్యాక్ టు బ్యాక్ ట్వీట్లు వేస్తున్నాడు.

భోళాశంకర్ సినిమా థియేటర్లలోకి వచ్చి, మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకులతో పాటు, మెగాభిమానులు కూడా ఈ సినిమాను లైక్ చేయలేదు. 'రీమేక్స్ వద్దన్నయ్యా' అంటూ ట్విట్టర్ లో ఎడతెగని పోస్టులు పెడుతున్నారంటే, ఈ సినిమా రిజల్ట్ అర్థం చేసుకోవచ్చు

ఈ మొత్తం వ్యవహారంపై నిన్నట్నుంచే స్పందిస్తూ వస్తున్నాడు ఆర్జీవీ. భజన బృందాన్ని చిరంజీవి దూరం పెట్టాల్సిన అవసరం ఉందంటూ నిన్న ట్వీట్ చేసిన వర్మ.. పొగడ్తలతో ముంచే బ్యాచ్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఎవ్వరూ ఉండరంటూ పరోక్షంగా చిరంజీవిని హెచ్చరించాడు.

ఈరోజు భోళాశంకర్ పై మరో ట్వీట్ వేశాడు వర్మ. ఈసారి ఏకంగా మరో కొత్త అనుమానం రేకెత్తించాడు. “వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో, ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్” అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక్కడ బీఎస్ అంటే భోళాశంకర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వర్మ తాజా ట్వీట్ తో ప్రేక్షకుల్లో మరిన్ని డౌట్స్ రేకెత్తించాడు. అతడు నేరుగా రవితేజ గురించి ప్రస్తావించినప్పటికీ, పరోక్షంగా చిరంజీవి ఇమేజ్ తగ్గిపోతోందనే కఠోర వాస్తవాన్ని వెల్లడించాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా మారింది.