ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణి ఎట్టకేలకు తన పదేళ్ల ప్రేమకు ఏడడుగులతో శుభం కార్డు వేశాడు. ప్రేమించిన అమ్మాయితో జీవితాన్ని పంచుకుంటున్న శుభ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణికి దేవిశ్రీ ప్రసాద్ ట్విటర్ ద్వారా రొమాంటిక్గా విషెస్ చెప్పాడు .
ఫరా అనే అమ్మాయిని పదేళ్లుగా శ్రీమణి ప్రేమిస్తున్నాడు . ఇప్పుడు ఒక ఇంటి వారయ్యారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘నా జీవితంలోకి ఫరాకు స్వాగతం చెబుతున్నాను. గత పదేళ్ళుగా ఈ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాం. ఎట్టకేలకు మా కల సాకారమైంది. మా మనసులని అర్థం చేసుకున్న దేవుడికి , తల్లిదండ్రులకి ధన్యవాదాలు’ అని శ్రీమణి భావోద్వేగ ట్వీట్ చేశాడు.
శ్రీమణి మొట్ట మొదట సుకుమార్ తెరకెక్కించిన ‘100% లవ్’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సెగ సినిమాలోని వర్షం ముందుగా అనే పాటతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాడు.
శ్రీమణి ప్రేక్షకులు మెచ్చేలా అనేక అద్భుత సినిమాలకు మంచి లిరిక్స్ అందించాడు. దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన సినిమాలకు పని చేశాడు. ఇటీవల ‘ఉప్పెన’,‘రంగ్దే’ సినిమాలకు శ్రీమణి సాహిత్యం అందించాడు.
ఈ సందర్భంగా తన స్నేహితుడైన శ్రీమణికి దేవిశ్రీ ప్రసాద్ వినూత్నంగా, రొమాంటిక్గా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు.
‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట’ అంటూ శ్రీమణి మాటలను ఆయనకే అప్పగిస్తూ లయబద్ధంగా దేవి రాసుకొచ్చాడు. ఎంతైనా సంగీత మనసు కదా! ఆ మాత్రం కొత్తదనం లేకపోతే కిక్ ఏముంటుంది?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు