ఆర్ఆర్ ఫ్యాన్స్ ఛలో ముంబాయ్

రెండు మూడెేళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల నెల రోజుల్లోకి వచ్చేసింది. రాజ‌మౌళి ఆధ్వర్యంలోని యూనిట్ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.  Advertisement ముంబాయి, బెంగళూరుల్లో మీడియా మీట్ లు పూర్తి చేసింది.…

రెండు మూడెేళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల నెల రోజుల్లోకి వచ్చేసింది. రాజ‌మౌళి ఆధ్వర్యంలోని యూనిట్ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 

ముంబాయి, బెంగళూరుల్లో మీడియా మీట్ లు పూర్తి చేసింది. తెలుగునాట మీడియా మీట్ ను శనివారం ప్లాన్ చేసారు. ఇది అయిన తరువాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు ప్రారంభమవుతాయి.

ముంబాయిలొ ఓ మాంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆలియా భట్, అజ‌య్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ వున్నందున, బాలీవుడ్ లో సినిమాను అందిస్తున్నపెన్ మూవీస్ సంస్థ భారీ ఫంక్షన్ ను తలపెట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ఎన్టీఆర్, చరణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంత మందిని ముంబాయి తీసుకువెళ్లే ఆలోచన చేస్తున్నారు. పత్యేక రైలు కానీ లేదూ అంటే వివిధ రైళ్లలో కానీ ఫ్యాన్స్ ను తీసుకెళ్లే అవకాశం వుంది. 

ఎంత మందిని తీసుకెళ్తారు అనే దాని మీద రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. వెయ్యి నుంచి రెండు వేలకు పైగా ఫ్యాన్స్ ను తీసుకెళ్తారని వినిపిస్తోంది.

అది అయిన తరువాత మూడో వారంలో కానీ కాస్త అటుగా కానీ హైదరాబాద్ ల్లో, ఆ తరువాత విశాఖల్లో భారీ సభలు వుండే అవకాశం వుంది.