టాలీవుడ్ లో డిస్కషన్.. కోలీవుడ్ లో ఆఫర్

కర్నాటకకు చెందిన రష్మిక, పూజా హెగ్డే సౌత్ లో ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో మరో కన్నడ భామ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో మెల్లమెల్లగా అవకాశాలు అందుకోబోతోంది. ఆమె…

కర్నాటకకు చెందిన రష్మిక, పూజా హెగ్డే సౌత్ లో ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో మరో కన్నడ భామ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో మెల్లమెల్లగా అవకాశాలు అందుకోబోతోంది. ఆమె పేరు రుక్మిణి వసంత్.

'సప్తసాగరాలు దాటి' అనే సినిమాతో పాపులర్ అయింది రుక్మిణి వసంత్. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజైంది. సైడ్-ఏ, సైడ్-బి అంటూ రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ రుక్మిణి నటన, ఆమె లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

ఆ సినిమా తర్వాతే టాలీవుడ్ లో రుక్మిణి పేరు ఎక్కువగా వినిపించింది. ఆమధ్య విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ పేరు పరిశీలించినట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత రవితేజ సినిమా విషయంలో కూడా ఈమె పేరు వినిపించింది.

ఓవైపు తెలుగులో ఇలా రుక్మిణి పేరు నలుగుతుండగానే, మరోవైపు కోలీవుడ్ నుంచి ఆమెకు క్రేజీ ఆఫర్ వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

త్వరలోనే ఆమె తన తెలుగు సినిమాను ప్రకటించనుంది. రష్మిక రేంజ్ లో పాపులర్ అవుతుందనే డిస్కషన్ ఎప్పుడో మొదలైపోయింది. అన్నట్టు రష్మికను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టి సినిమాతోనే, ఈమె తెలుగులో కూడా పాపులర్ అవ్వడం విశేషం.