ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్ శివన్ కన్నుముశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావాలార్ వరదరాజన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన 1973లో కన్నుమూశారు. వరదరాజన్ కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా.. తాజాగా మరో కుమారుడు తుదిశ్వాస విడిచారు.
కాగా పావలర్ శివన్ ఫేమస్ గిటారిస్ట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్ గా పనిచేస్తున్నారు. సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ కాలేదు.