Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాయిపల్లవి డేట్స్ ట్రబుల్

సాయిపల్లవి డేట్స్ ట్రబుల్

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు అంతా రెడీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ - రానా లతో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లతో సాగర్ డైరక్షన్ లో ఈ రీమేక్ కు ఏర్పాట్లు అన్నీ రెడీ అయిపోయాయి. 

పవన్ భార్యగా సాయి పల్లవి, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్, రానా తండ్రిగా సుముద్రఖని, ఇతర క్యారెక్టర్లలో బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడంతా సమస్య కాలేదు. సాయిపల్లవి డేట్స్ తోనే సమస్యగా వుందని బోగట్టా. ఆమె వేరే సినిమాల్లో బిజీగా వుంది. 

అయ్యప్పన్ రీమేక్ డేట్ లకు ఆమె డేట్ లకు సెట్టింగ్ కుదరడం లేదు. ఈ చిక్కుముడి వీడితే సినిమా సెట్ మీదకు వెళ్లిపోతుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ చేసే క్రిష్ సినిమా వర్క్ కొద్దిగా పూర్తి చేసి వస్తారు.

వాస్తవానికి అయ్యప్పన్ రీమేక్ నే నేరుగా ముందు స్టార్ట్ అయ్యేది. కానీ క్రిష్ సినిమాకు ఓ సెట్ వుంది. అది తీసేయాల్సి వుంది. అలా తీసేయాలంటే అందులో వర్క్  ఫినిష్ చేయాలి. అందుకోసం క్రిష్ రిక్వెస్ట్ చేయడంతో పవన్ ఓకె అనాల్సి వచ్చింది. 

ఆ వర్క్ అయిపోగానే అయ్యప్పన్ రీమేక్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లో షెడ్యూలు పూర్తి చేసుకున్నాక, పోలాచ్చిలో ఒక లెంగ్తీ షెడ్యూలులో సినిమా ఫినిష్ అవుతుంది. త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్ లో ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్లాన్ చేస్తున్నారు.

మంచి కిక్‌ ఇచ్చారు

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?