సాయితేజ్ కొత్త సినిమా.. డైలమాలో పవన్ సినిమా

వినోదాయశితం రీమేక్.. సముత్తరఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయాల్సిన ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదని కొంతమంది అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా తర్వాత సెట్స్ పైకి వచ్చేది ఇదేనంటూ మరికొంతమంది చెబుతున్నారు.…

వినోదాయశితం రీమేక్.. సముత్తరఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయాల్సిన ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదని కొంతమంది అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా తర్వాత సెట్స్ పైకి వచ్చేది ఇదేనంటూ మరికొంతమంది చెబుతున్నారు. ఈ మొత్తం సస్పెన్స్ కు తెరదించాడు సాయిధరమ్ తేజ్.

వినోదాయశితం రీమేక్ లో పవన్ కల్యాణ్ తో పాటు సాయితేజ్ కూడా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాయితేజ్ కు అడ్వాన్స్ కూడా ముట్టింది. ఈ రీమేక్ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్టు చేయకూడదని, పవన్ కల్యాణ్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు అందుబాటులో ఉండాలనే షరతుకు కూడా ఒప్పుకున్నాడు.

కట్ చేస్తే, ఈరోజు కొత్త సినిమా మొదలుపెట్టాడు సాయితేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ పై కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఈరోజు ఈ ప్రాజెక్టు లాంఛనంగా మొదలైంది. స్వయంగా సాయితేజ్ క్లాప్ కొట్టి మరీ ఈ సినిమా లాంఛ్ చేశాడు.

సాయితేజ్ ఇలా మరో సినిమా స్టార్ట్ చేశాడంటే, వినోదాయ శితం రీమేక్ ఇప్పట్లో రాదనే దానర్థం. సాయితేజ్ క్లాప్ కొట్టడంతో, పవన్ చేయాల్సిన రీమేక్ సినిమాపై పరోక్షంగా క్లారిటీ వచ్చినట్టయింది.

నిజానికి హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీశ్ శంకర్ సినిమాకు పవన్ ప్రాధాన్యం ఇచ్చాడనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే వెల్లడించింది. అయినప్పటికీ వినోదాయ శితం రీమేక్ పై పుకార్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సాయితేజ్ కొత్త సినిమా ప్రారంభించడంతో, ఇకపై ఈ పుకార్లు ఆగిపోతాయనే అనుకోవాలి.