మహేష్ బాబు-పరుశురామ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా షూట్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ను నిర్మాతలు వెల్లడించారు.
దూకుడు సినిమా తరువాత మళ్లీ హీరోయిన్-హీరో ట్రాక్ సర్కారువారి పాట సినిమాలో అద్భుతంగా కుదిరిందన్నారు. దూకుడులో మాదిరిగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందని చెప్పారు.
దర్శకుడు పరుశురామ్ ట్రాక్ రికార్డు చూస్తే హీరో హీరోయిన్ల మధ్య ఫన్ బాగా పండిస్తాడు. గీతగోవిందం సినిమా సక్సెస్ కు అది కూడా ఓ కారణం. నిర్మాతలు చెబుతున్నదాన్ని బట్టి పరుశురామ్ ఈ సారి కూడా మహేష్-కీర్తి ల నడుమ మాంచి ఫన్ సీన్లు పండించినట్లు అర్థం అవుతోంది.
సరిలేరునీకెవ్వరు సినిమా దగ్గర నుంచి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సర్కారువారిపాట సినిమా తరువాత కూడా మరోసారి ఆయన అనిల్ రావిపూడి డైరక్షన్ లో ఎంటర్ టైన్ మెంట్ సినిమానే చేయబోతున్నారు.