Advertisement

Advertisement


Home > Movies - Movie News

శర్వానంద్ జై బాలయ్య

శర్వానంద్ జై బాలయ్య

జై బాలయ్య ఫీవర్ నడుస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ లో.  బన్నీ జై బాలయ్య అన్నాడు ప్రీరిలీజ్ ఈవెంట్ లో. మళ్లీ అలాగే లక్ష్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ జై బాలయ్య అంటూ స్పీచ్ స్టార్ట్ చేసాడు. థియేటర్లకు మళ్లీ పూర్వ కళను బాలయ్య తీసుకువచ్చారని అన్నాడు. లక్ష్య సినిమాతో జనం జై శౌర్య అనాలని, అంత రేంజ్ హిట్ కావాలని ఆయన అన్నారు.

స్పోర్ట్స్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువే అని, కానీ స్పోర్స్ సినిమాకు హీరో ఫిట్ గా వుండడం కీలకం అని శర్వా అన్నారు. అంతే కాదు, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ముగిసాక తను సిక్స్ ఫ్యాక్ సాధించిన తరువాతే సినిమా చేస్తానని శర్వా అనడం విశేషం. 

లక్ష్య ప్రీరీలీజ్ ఫంక్షన్ లో నాగశౌర్య మాట్లాడుతూ ఆసియన్ సునీల్ తనకు పెద్దన్న అని, ఆయన 2019లో లక్ష్య స్క్రిప్ట్  విన్న వెంటనే తనను తాను పాత్రలో చూసుకున్నానని, నిర్మాతలు ముగ్గురూ ఈ సినిమా తనను కంటికి రెప్పలా చూసుకున్నారని అన్నారు. డైరక్టర్ సంతోష్, డివోపి రామ్ రెడ్డి ఇద్దరూ కలిసి సినిమాను ది బెస్ట్ గా వచ్చేవరకు కష్టపడ్డారని శౌర్య అన్నారు.

శేఖర్ కమ్ముల సినిమాలో నటించాలని వుందని, ఆయన ఎప్పుడు చాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నా అని అన్నారు. ఇండస్ట్రీలో తనకు నచ్చిన వ్యక్తుల్లో శర్వానంద్ అని, ఆయన కాంబినేషన్ లో నటించడానికి తాను రెడీ అన్నారు.

పంక్షన్ లో నిర్మాతలు రామ్మోహనరావు, శరత్ మరార్, ఆసియన్ సునీల్, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల తదితరులు పాల్గొన్నారు. 

Click Here For Photo Gallery

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?