ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శశి'. సురభి నాయికగా లవ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.ఆది సాయికుమార్ బర్త్డే సందర్భంగా 'శశి' టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలయ్యింది.
చిరంజీవి మాట్లాడుతూ, “నా మిత్రుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన చిత్రం 'శశి'. టీజర్ చూస్తుంటే చాలా రగ్డ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆది ఓ స్వీట్ లవర్ బాయ్ లాగా, ఓ చాక్లెట్ బాయ్ లాగా కనిపించాడు. 'శశి' టీజర్లో అతడిని చూస్తుంటే.. మ్యాచోగా, దృఢమైన బాడీతో చాలా బాగా కనిపిస్తున్నాడు.
మంచి ట్రాన్స్ఫర్మేషన్. ఈ సినిమాతో ఆది కచ్చితంగా ప్రేక్షకుల మన్ననలను పొందుతాడనే ప్రగాఢ నమ్మకం నాకుంది. నిర్మాతలు, దర్శకుడు, టెక్నీషియన్స్, నటీనటులదరికీ నా ప్రత్యేక అభినందనలు. . మొత్తం సినిమా టీమ్కు ఆల్ ద బెస్ట్” అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ, “నా బర్త్డేకి 'శశి' టీజర్ను మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'శశి' ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం” అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ, “ఆది తొలి సినిమా 'ప్రేమ కావాలి'కి అన్నయ్య విషెస్ లభించాయి. ఇప్పుడు ఆది బర్త్డేకి 'శశి' టీజర్ను ఆయన లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది.” అన్నారు.