సవ్యసాచి తరువాత మళ్లీ ఇదే

నాగ్ చైతన్య కెరీర్‌లో భారీ సినిమా. మల్టీ స్టారర్ సినిమా సవ్యసాచి. దాని తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా గీతా సంస్థ నిర్మిస్తున్నదే.  Advertisement చందు మొండేటి- సాయి పల్లవి…

నాగ్ చైతన్య కెరీర్‌లో భారీ సినిమా. మల్టీ స్టారర్ సినిమా సవ్యసాచి. దాని తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా గీతా సంస్థ నిర్మిస్తున్నదే. 

చందు మొండేటి- సాయి పల్లవి కాంబినేషన్ లో తయారవుతున్న పాన్ ఇండియా సినిమా ఇది.  ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతోందట. జస్ట్ ఆన్ పేపర్‌నే 80 కోట్ల వరకు ఖర్చు తేలుతోందని తెలుస్తోంది. వాస్తవానికి నాగ్ చైతన్య సినిమాగా అంత మార్కెట్ వుండదు. కానీ సబ్జెక్ట్ పరంగా ఖర్చు వుంది. కథకు ఆ రేంజ్ వుంది. అందుకే గీతా సంస్థ ముందుకే వెళ్లడానికి నిర్ణయించుకుంది.

ఈ మేరకు ప్రాజెక్ట్ ను వేయబుల్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ తో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టోటల్ నాన్ థియేటర్ హక్కులు కనుక నెట్ ఫ్లిక్స్ తీసుకుంటే ప్రాజెక్ట్ పని సులువు అవుతుంది. ఈ మేరకు డిస్కషన్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

సవ్యసాచి సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ కాస్త ఎక్కువే వుంది. సముద్రం మీద ఎక్కువగా జరిగే కథ కావడంతో సిజి వర్క్ బాగా వుంటుంది. అందువల్ల కాస్ట్ ఎక్కువ పడుతోందని తెలుస్తోంది. దీనికి తోడు పాన్ ఇండియా నటులను మరికొంత మందిని తీసుకుంటున్నారు. టెక్నీషియన్లను కూడా టాప్ పీపుల్ ను హైర్ చేస్తున్నారు. అందువల్ల మొత్తం మీద చైతన్య కెరీర్ లో అత్యంత భారీ సినిమా ఇదే అవుతుంది.