Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెకెండ్ ఫేజ్ లో తొలి విడుదల

సెకెండ్ ఫేజ్ లో తొలి విడుదల

సినిమాల విడుదలలకు మళ్లీ బ్రేక్ పడింది.దీంతో ఓటిటి ల హడావుడి మళ్లీ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో కరోనా సెకెండ్ ఫేజ్ లో తొలి ఒటిటి సినిమాగా 'థాంక్యూ బ్రదర్' విడుదల కాబోతోంది. 

యాంకర్ అనసూయ కీలకపాత్రలో నటించిన సినిమా ఇది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే తెలుగు ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా సంస్థ ఈ సినిమాతో థియేటర్ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకుంది. ఆ మేరకు ఈ సినిమా ఫస్ట్ కాపీ హక్కులు తీసుకుంది.

ఈ నెలాఖరున థియేటర్ లో తరువాత తమ ఒటిటిలో విడుదల చేద్దాం అనుకుంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు సగానికి పైగా మూత పడ్డాయి. సెకెండ్ షో లు క్యాన్సిల్ అయ్యాయి. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ ఆదేశాలు జారీ అయ్యాయి. 

అందుకే ఇక థియేటర్ విడుదల ఆలోచన మానుకుని ఆహా లో నేరుగా విడుదల చేయబోతున్నారు. డేట్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?