Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో సినీ ప్రముఖుడికి కరోనా

మరో సినీ ప్రముఖుడికి కరోనా

టాలీవుడ్, కోలీవుడ్ ను పట్టి కుదిపేస్తోంది కరోనా. ఏ ఒక్కర్నీ వదలడం లేదు. రెండేళ్లుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్లు సైతం మూడో వేవ్ లో దొరికిపోతున్నారు. దీనికి టాలీవుడ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ తమన్ అయితే, కోలీవుడ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్వరాఘవన్. 

కరోనాకు చిక్కకుండా లెక్కలేనన్ని జాగ్రత్తలు తీసుకున్న తమన్ ఈమధ్య వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అటు కోలీవుడ్ లో ఇలానే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సెల్వరాఘవన్ ఇప్పుడు కరోనా బాధితుడిగా మారారు.

అవును.. దర్శకుడు సెల్వరాఘవన్ కు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు పాజిటివ్ గా నిర్థారణ అయిందని ఈ దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. గడిచిన 2-3 రోజులుగా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరిన ఈ దర్శకుడు.. తనకు కరోనా సోకడంపై విచారం వ్యక్తం చేశాడు.

సరిగ్గా 24 గంటల ముందు సెల్వరాఘవన్ భార్య కరోనా బారిన పడింది. తను కరోనాతో బాధపడుతున్నానని, ఐసొలేషన్ లో రెండో రోజు తీవ్రమైన జ్వరం, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నానని ఆమె ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన 24 గంటలకే సెల్వరాఘవన్ కూడా తనకు కరోనా సోకినట్టు తెలిపాడు.

థర్డ్ వేవ్ లో కరోనా బాధిత సెలబ్రిటీల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మమ్ముట్టి, కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్, సురేష్ గోపి, తమన్, బండ్ల గణేశ్, త్రిష, సత్యరాజ్, మహేష్ బాబు, వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలా లెక్కలేనంత మంది కరోనా బారిన పడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?