Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెంటిమెంట్ ఫీల్ అవుతున్న బోయపాటి

సెంటిమెంట్ ఫీల్ అవుతున్న బోయపాటి

సమీకరణాలు అటుఇటు మారితే తప్ప, మ్యాగ్జిమమ్ దేవిశ్రీప్రసాద్ నే తీసుకుంటాడు బోయపాటి. సరైనోడులో పాటలు సూపర్ గా ఉంటాయి. అన్నీ మ్యూజికల్ హిట్సే. అయినప్పటికీ తన నెక్ట్స్ సినిమాలకు తమన్ ను రిపీట్ చేయలేదు. దేవిశ్రీనే తీసుకున్నాడు. బోయపాటి తీసిన జయజానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలకు డీఎస్పీనే మ్యూజిక్.

అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు బోయపాటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాలకు (సింహా, దమ్ము, సరైనోడు మినహా) దేవిశ్రీనే రిపీట్ చేస్తున్న బోయపాటి, ఈసారి మాత్రం కొత్త సెంటిమెంట్ అందుకున్నాడు. తమన్ ను తీసుకున్నాడు.

అవును.. బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ కంపోజర్ మంచి ఊపుమీదున్నాడు. తమన్ ఎలాంటి సాంగ్స్ ఇస్తాడనే విషయాన్ని పక్కనపెడితే, ఇలాంటి రైజింగ్ హ్యాండ్స్ ను తన టీమ్ లో ఉంచుకోవడం స్వతహాగా బోయపాటికి ఇష్టం. అందుకే దేవిశ్రీ స్థానంలోకి తమన్ వచ్చిచేరాడు. 

ఇంతకుముందే చెప్పినట్టు తమన్ తో సరైనోడు సినిమాకు వర్క్ చేశాడు బోయపాటి. సో.. ఆ మేజిక్ ను బాలయ్య సినిమాతో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తమ్మీగా మెల్లగా దేవిశ్రీ అవకాశాలకు గండికొట్టడం స్టార్ట్ చేశాడు తమన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?