డిజాస్టర్ మూవీకి సీక్వెల్.. సీఎం చేతుల మీదుగా ప్రకటన

ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పార్ట్-2 ప్రకటించడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే సినిమా హిట్టయితేనే సీక్వెల్, లేదంటే మొత్తం పక్కనపెట్టేస్తున్నారు. ఇది సహజం కూడా. దీనికి పూర్తి విరుద్ధంగా తెరపైకి రాబోతోంది కబ్జా-2. Advertisement…

ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పార్ట్-2 ప్రకటించడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే సినిమా హిట్టయితేనే సీక్వెల్, లేదంటే మొత్తం పక్కనపెట్టేస్తున్నారు. ఇది సహజం కూడా. దీనికి పూర్తి విరుద్ధంగా తెరపైకి రాబోతోంది కబ్జా-2.

ఉపేంద్ర హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా కబ్జా. అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటి. కేజీఎఫ్ ను కాపీ కొడుతూ తీశారనే విమర్శలతో పాటు, భారీగా నష్టాలు కూడా మూటగట్టుకుంది ఈ మూవీ. ఇలాంటి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శక-నిర్మాత ఆర్ చంద్రు.

ఆర్సీ స్టుడియోస్ బ్యానర్ పై ఒకేసారి 5 పాన్ ఇండియా సినిమాలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రితో పాటు, హీరో ఉపేంద్ర హాజరయ్యాడు. వీళ్ల చేతుల మీదుగా కబ్జా-2ను రాత్రి సగర్వంగా ప్రకటించారు.

రూ.400 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్న 5 సినిమాల్లో కబ్జా-2కు కూడా చోటివ్వడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించాడు చంద్రు. కబ్జాను తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొచ్చిన ఈ దర్శకుడు.. ఆ సినిమా చుట్టూ చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నాడు. ఈసారి ఉపేంద్రను మరింత కొత్తగా, ఎగ్రెసివ్ గా చూస్తారని గ్యారెంటీ ఇస్తున్నాడు.