Advertisement

Advertisement


Home > Movies - Movie News

కూతురుకి ఘనంగా పెళ్లి చేసిన శంకర్

కూతురుకి ఘనంగా పెళ్లి చేసిన శంకర్

దర్శకుడు శంకర్, తన కూతురు ఐశ్వర్యకు ఘనంగా పెళ్లి చేశాడు. శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య, తరుణ్ కార్తికేయన్ పెళ్లి చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కల్యాణ వేడుకకు తమిళనాడు సీఎంతో పాటు.. కమల్ హాసన్, మణిరత్నం, సూర్య, విక్రమ్, నయనతార, కార్తి లాంటి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. వధూవరుల్ని ఆశీర్వదించారు.

శంకర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు 2021లోనే పెళ్లి చేశాడు. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో మహాబలిపురంలో ఐశ్వర్య పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజులకే పోక్సో కేసులో ఇరుక్కున్నాడు రోహిత్. తన అకాడమీలో మహిళా క్రికెటర్ ను వేధించాడనే ఆరోపణలు అతడిపై వచ్చాయి.

దీంతో పెళ్లయిన 6 నెలలకే అతడి నుంచి విడిపోయి తండ్రి శంకర్ దగ్గరకు వచ్చేసింది ఐశ్వర్య. ఆ తర్వాత అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడామెకు రెండో పెళ్లి చేశాడు దర్శకుడు శంకర్.

తన దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ తో సంబంధం కలుపుకుంటున్నాడు. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరిగింది. తాజాగా ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.

శంకర్ రెండో కూతురు అదితి శంకర్, కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక శంకర్ కెరీర్ లో తొలిసారి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు భారతీయుడు-2 పనులతో పాటు, మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇంత బిజీగా ఉంటూ, మరోవైపు కూతురు పెళ్లి చేశాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?