ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం

హీరో శర్వానంద్ త్వరలోనే తన సోలో లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఈరోజు జరిగింది. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన…

హీరో శర్వానంద్ త్వరలోనే తన సోలో లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఈరోజు జరిగింది. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ కు రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. శర్వా-చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షితా రెడ్డి. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది రక్షితారెడ్డి.

వీళ్ల ఎంగేజ్ మెంట్ కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ కు చెందిన ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్  మీడియాలో వైరల్ గా మారాయి.

ఒకే ఒక జీవితం సినిమాతో తాజాగా సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్. ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని సినిమాలు సైన్ చేశాడు. ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

శర్వానంద్-రక్షితారెడ్డి పెళ్లి తేదీని ఇరు కుటుంబసభ్యులు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ వేసవిలో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Click Here For Photo Gallery