Advertisement

Advertisement


Home > Movies - Movie News

మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న హీరోయిన్

మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న హీరోయిన్

మిస్ ఇండియా పోటీల కోసం చాలా కష్టపడింది. ఎంతగానో ప్రాక్టీస్ చేసింది. కడుపు మాడ్చుకుంది. ఇక మరికొన్ని రోజుల్లో పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా.. అనూహ్యంగా మిస్ ఇండియా కాంటెస్ట్ నుంచి తప్పుకుంది శివానీ రాజశేఖర్. అవును.. అందాల పోటీ నుంచి రాజశేఖర్ కుమార్తె తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే ప్రకటించింది.

"దురదృష్టవశాత్తూ అందాల పోటీలకు సంబంధించి చాలా ట్రయినింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్సయ్యాను. మెడికల్ థియరీ ఎగ్జామ్స్ వల్ల ఇలా జరిగింది. ఆ తర్వాత మలేరియా బారిన పడ్డాను. బౌన్స్ బ్యాక్ అవుతానని అనుకున్నాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందుకు జరిగాయి. ఇవాళ్టి నుంచే ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. అంతేకాదు, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనున్న జులై 3న కూడా నాకు ఎగ్జామ్ ఉంది."

ఈ కారణాల వల్ల ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగం కాలేకపోతున్నానంటూ బాధగా పోస్టు పెట్టింది శివానీ. ఈ సందర్భంగా తనకు సహకరించిన వ్యక్తులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం హెల్త్ పరంగా కోలుకుంటున్నానని, త్వరలోనే ఎగ్జామ్స్ అన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తానని ప్రకటించింది.

మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించింది శివానీ రాజశేఖర్. భారీ పోటీ మధ్య మిస్-తమిళనాడుగా ఎంపికైంది. ఇక తుది పోరుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది.

అద్భుతం, శేఖర్ లాంటి సినిమాల్లో నటించింది శివానీ. ప్రస్తుతం ఆమె రాజ్ తరుణ్ తో కలిసి జీ5కు ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. మెడికల్ ఎగ్జామ్స్ అయిన వెంటనే తిరిగి సినిమాల్లో బిజీ అవుతానంటోంది ఈ బ్యూటీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?