Advertisement

Advertisement


Home > Movies - Movie News

'సాహో' హీరోయిన్.. రెండు సినిమాల్లో దేనికి మొగ్గు?

'సాహో' హీరోయిన్.. రెండు సినిమాల్లో దేనికి మొగ్గు?

ముందుగా అనుకున్న తేదీన ప్రకారం అయితే శ్రద్ధా కపూర్ సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావాలి. 'సాహో' సినిమా ఆగస్టు ముప్పై వద తేదీకి వాయిదా పడ్డాకా, అదే రోజు ఆమెకు సంబంధించిన మరో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. 'చ్చిచ్చోరే' అనే ఆ సినిమాను ఆగస్టు ముప్పై వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు దాని రూపకర్తలు.

'సాహో' ఆగస్టు 15కే విడుదల అయిపోతే, ఆగస్టు ముప్పైన ఆ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సాహో ఆగస్టు ముప్పైకి వాయిదా పడింది. దీంతో ఆ రోజున  శ్రద్ధా కపూర్ సినిమాలు రెండు విడుదల కావాల్సింది. అయితే 'చ్చిచ్చోరే' మేకర్లు శ్రద్ధా కోసం తమ సినిమాను మరో వారం వాయిదా వేశారు. 'సాహో' విడుదల అయిన వారానికి ఆ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇలా వారం వ్యవధిలో శ్రద్ధా కపూర్ సినిమాలు రెండు విడుదల కాబోతున్నాయి. దీంతో తను చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నట్టు చెప్పింది శ్రద్ధా కపూర్. తను ఈ ఏడాదిలో మొత్తం మూడు సినిమాల కోసం వర్క్ చేసినట్టుగా, వాటిల్లో రెండు సినిమాలు కేవలం వారం వ్యవధిలో విడుదల కానున్నాయని శ్రద్ధ ప్రకటించింది.

రెండింటికీ తను ప్రమోషన్ వర్క్ చేయాల్సి ఉందని అంటోంది. వీటిల్లో 'సాహో' భారీ బడ్జెట్ సినిమా, మూడు భాషల్లో విడుదల అవుతున్న సినిమా. కాబట్టి చాలా ప్రమోషన్ వర్కే చేయాల్సి ఉంది. ఇక 'చ్చిచ్చోరే' ప్రమోషన్ లో కూడా తను పాల్గొనాల్సి ఉందని అంటోంది. మరి ఈ రెండు సినిమాలకూ శ్రద్ధా ఎలా సమన్యాయం చేస్తుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?