Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాంగ్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి 'సితార'

లాంగ్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి 'సితార'

టాలీవుడ్ లో షూటింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా సెట్స్ పైకొచ్చాయి. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కూడా షూటింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చింది.

నాగశౌర్య, రీతూవర్మ జంటగా ఓ సినిమా నిర్మిస్తోంది ''సితార''. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమౌతున్న ఈ సినిమాకు వరుడు కావలెను అనే టైటిల్ పెట్టారు.  ఇప్పుడీ సినిమా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. హీరోహీరోయిన్లపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో పాటు ఇంకొన్ని సీన్స్ తీస్తే టోటల్ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది.

అటు 'నరుడి బ్రతుకు నటన' అనే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చింది ఈ బ్యానర్. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో విమల్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం సిద్ధూపై కొన్ని సీన్స్ తీస్తున్నారు.

ఇదే బ్యానర్ పై రావాల్సిన పవన్ కల్యాణ్ సినిమాపై మాత్రం ఇంకా నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం, వచ్చేనెల రెండో వారం లోపు ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు కేటాయించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?