బ‌య‌ట‌ప‌డిన మంచు ల‌క్ష్మీ ఈర్ష్య

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు ముద్దుల త‌న‌య మంచు ల‌క్ష్మీ బ‌య‌ట‌ప‌డింది. అది కూడా త‌న‌కు తానుగా ఆమె బ‌య‌ట పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. మెగాస్టార్ చిరంజీవి, త‌న తండ్రి మోహ‌న్‌బాబు టూర్‌కు వెళ్ల‌డంమే ఆమె ఈర్ష్య‌కు…

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు ముద్దుల త‌న‌య మంచు ల‌క్ష్మీ బ‌య‌ట‌ప‌డింది. అది కూడా త‌న‌కు తానుగా ఆమె బ‌య‌ట పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. మెగాస్టార్ చిరంజీవి, త‌న తండ్రి మోహ‌న్‌బాబు టూర్‌కు వెళ్ల‌డంమే ఆమె ఈర్ష్య‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైంది. మంచు ల‌క్ష్మీ స‌ర‌దాగా చేసిన ట్వీట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.  

“ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంత రచ్చ రచ్చ చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అంకుల్‌ వీకెండ్‌ ట్రిప్‌కు నాన్నను  ఒప్పించి మరీ తీసుకెళ్లాడు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగా ఉంది. కానీ మీ ఇద్దరూ కాలక్షేపం చేసేందుకు సమయం దొరికినందుకు నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది.  కానీ ఈ ట్రిప్‌లో ఏదో ఒక రోజు మేము కూడా మీతో పాటు జాయిన్‌ అవుతాము” అని ట్వీట్ చేశారామె.

ఆచార్య షూటింగ్‌ కోసం చిరంజీవి ఎంత బిజీగా గ‌డిపారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న కాస్త రిలాక్స్ కోసం చిన్న‌ బ్రేక్‌ తీసుకున్నారు. తనకు స‌న్నిహితుడైన మోహన్‌బాబుతో క‌లిసి సిక్కిం  టూర్‌కు వెళ్లారు. 

ఈ విషయ‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా  మంచు లక్ష్మీ స‌ర‌దాగా అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న తండ్రితో చిరంజీవి క‌లిసిన  ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. మంచు ల‌క్ష్మీ ట్వీట్‌పై నెటిజ‌న్లు కూడా అంతే స‌ర‌దాగా స్పందిస్తున్నారు. మిమ్మ‌ల్ని కూడా తీసుకెళ్లి ఉంటే ఎంత బాగుండో అని కామెంట్స్ చేస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు