ఎక్స్ క్లూజివ్.. ఎన్టీఆర్ పై స్పెషల్ వీడియో

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. కొరటాల శివ, సుధాకర్ బెస్ట్ ఫ్రెండ్స్…

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. కొరటాల శివ, సుధాకర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు యూనిట్. తాజాగా యువసుధ ఆర్ట్స్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన నిర్మాత, ఇకపై వరుసపెట్టి అప్ డేట్స్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఇందులో భాగంగా సినిమా షూటింగ్ తో పాటు ఇతర వివరాల్ని వెల్లడించడం కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఎన్టీఆర్ పై స్పెషల్ గా షూటింగ్ చేసి మరీ ఆ వీడియో విడుదల చేయబోతున్నారు. ఇలా మొదటి రోజు నుంచే ప్రాజెక్టుపై అంచనాలు పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఇంతకుముందు ఎన్టీఆర్-కొరటాల కాంబోలో జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిశారు. ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ తేదీని ప్రకటిస్తారు.