Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరిన్ని అనుమానాలకు తావిచ్చిన చరణ్-శంకర్

మరిన్ని అనుమానాలకు తావిచ్చిన చరణ్-శంకర్

ఈరోజు గ్రాండ్ గా లాంఛ్ అయింది రామ్ చరణ్, శంకర్ సినిమా. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా.. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. వీళ్లిద్దరి రాకతో ఈ ప్రాజెక్టుపై మరిన్ని అనుమానాలు పెరిగాయి. ఎందుకో చూద్దాం..

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న చరణ్-శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. అటుఇటుగా ఓ 20 నిమిషాల నిడివి ఉన్న ఆ పాత్రను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో చేయించాలనేది ప్లాన్. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకొచ్చాయి.

తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి పవన్ కల్యాణ్ తో  చేయిస్తారని చాలామంది అనుకున్నారు. అయితే ఈరోజు లాంఛింగ్ కార్యక్రమం చూసిన తర్వాత ఈ అనుమానాలన్నీ కొత్త టర్న్ తీసుకున్నాయి. చరణ్-శంకర్ సినిమాలో కీలక పాత్రను చిరంజీవితో చేయించే ఆలోచనలో ఉన్నారని కథనాలు మొదలయ్యాయి.

దీనికి కారణం లాంఛింగ్ కు చిరంజీవి హాజరవ్వడమే. వీటికి మరో కొత్త యాంగిల్ జోడిస్తూ.. తెలుగులో రణ్వీర్ సింగ్ ఆ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూ మరికొంతమంది ఊహాగానాలు అల్లేశారు. 

వాస్తవానికి ఆ ప్రత్యేక పాత్రను ఎవరితో చేయించాలనే విషయంపై యూనిట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పట్లో తీసుకునే ఉద్దేశం కూడా లేదు. షూటింగ్ దాదాపు సగం పూర్తయిన తర్వాత, అప్పుడు ఏ హీరో అందుబాటులో ఉంటే, ఆ స్టార్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. అది చిరంజీవి అవ్వొచ్చు, పవన్ కల్యాణ్ కావొచ్చు. 

సగం సినిమా పూర్తయ్యేసరికే శంకర్ సినిమా బడ్జెట్ చేయి దాటిపోతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాత్రకు స్టార్ ను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెడతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?