త్వరలోనే ఆ హీరో త్రిపాత్రాభినయం

చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేశారు. కానీ ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో కూడా చేరబోతున్నాడు. అతడే శ్రీవిష్ణు. తను త్వరలోనే త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు…

చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేశారు. కానీ ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో కూడా చేరబోతున్నాడు. అతడే శ్రీవిష్ణు. తను త్వరలోనే త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ఈ హీరో ప్రకటించాడు.

రాజరాజచోర లాంటి క్లీన్ హిట్ అందించిన హసిత్ గోలి, శ్రీవిష్ణు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ సినినిమాలోనే శ్రీవిష్ణు త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. రాజరాజచోరలో చోరుడిగా, ఫ్యామిలీమేన్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు శ్రీవిష్ణు. కొత్త సినిమాలో మాత్రం షేడ్స్ కావంట, ఏకంగా 3 కొత్త పాత్రలే ఉంటాయని చెబుతున్నాడు.

మరోవైపు ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే హీరో, దర్శకుడితో అగ్రిమెంట్లు పూర్తిచేసింది సదరు ప్రొడక్షన్ హౌజ్.

భళాతందనాన సినిమాను ఈరోజు విడుదల చేసిన శ్రీవిష్ణు.. త్వరలోనే అల్లూరి అనే సినిమాను కూడా పూర్తిచేయబోతున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయాల్సిన సినిమా వివరాలు మరిన్ని బయటకొస్తాయి. అన్నట్టు ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందట. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ తో శ్రీవిష్ణు సినిమా చేయలేదు మరి.