ర‌ష్మీ, వితిక‌ను నామినేట్ చేసిన శ్రీ‌ముఖి

బిగ్‌బాస్‌-3 ర‌న్న‌ర్ శ్రీ‌ముఖి…రియాల్టీ షో ముగిసినా నామినేట్ చేయ‌డం మాత్రం మాన‌లేదు. బిగ్‌బాస్‌-3 హౌస్‌లో వితిక లేదా ఆమె భ‌ర్త వ‌రుణ్‌ను కొన్ని సంద‌ర్భాల్లో శ్రీ‌ముఖి నామినేట్ చేశారు. జీవితం కూడా ఓ రియాల్టీ…

బిగ్‌బాస్‌-3 ర‌న్న‌ర్ శ్రీ‌ముఖి…రియాల్టీ షో ముగిసినా నామినేట్ చేయ‌డం మాత్రం మాన‌లేదు. బిగ్‌బాస్‌-3 హౌస్‌లో వితిక లేదా ఆమె భ‌ర్త వ‌రుణ్‌ను కొన్ని సంద‌ర్భాల్లో శ్రీ‌ముఖి నామినేట్ చేశారు. జీవితం కూడా ఓ రియాల్టీ షో అని శ్రీ‌ముఖి భావించిన‌ట్టున్నారు. ఇప్పుడు ఆమె ఏకంగా ఇద్ద‌ర్ని నామినేట్ చేశారు. కంగారు ప‌డ‌కండి…ఏ రియాల్టీ షో గురించో మ‌నం మాట్లాడుకోవ‌డం లేదు.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కోసం ఆమె ర‌ష్మీతో పాటు వితిక‌ను కూడా నామినేట్ చేశారు.  తెలంగాణ ఎంపీ సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా బుల్లితెర ప్ర‌ముఖ యాంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్‌ శ్రీ‌ముఖి కూడా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో పాల్గొని మొక్క‌లు నాటారు. తాను మొక్క‌లు నాటుతున్న ఫొటోల‌ను ట్విట‌ర్‌లో పెట్టారు. గ్రీన‌రీ పెంచేందుకు త‌న‌వంతుగా ఆమె మొక్క‌లు నాటిన‌ట్టు తెలిపారు. అంతేకాకుండా ర‌ష్మీ, వితిక‌ల‌తో పాటు జానీ మాస్ట‌ర్‌ను నామినేట్ చేసి మొక్క‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించేందుకు త‌న వంతు కృషి చేస్తున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన ఎంపీ సంతోష్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్ అని ఆమె ట్విట‌ర్‌లో తెలిపారు.