సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు పార్ట్-2

మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇద్దరు పెద్ద హీరోల్ని పెట్టి, ఇలాంటి కథతో కూడా మల్టీస్టారర్ మూవీ చేయొచ్చు అని నిరూపించిన సినిమా ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో…

మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇద్దరు పెద్ద హీరోల్ని పెట్టి, ఇలాంటి కథతో కూడా మల్టీస్టారర్ మూవీ చేయొచ్చు అని నిరూపించిన సినిమా ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కల్ట్ అభిమానులున్నారు. ఇందులో డైలాగ్స్, సాంగ్స్, మరీ ముఖ్యంగా హీరోల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ సూపర్ హిట్.

మరి ఇలాంటి సినిమాకు పార్ట్-2 తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియా నేరుగా దిల్ రాజుకే వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు సీక్వెల్ చేద్దామంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర ప్రపోజల్ పెట్టారు రాజు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దర్శకుడే బయటపెట్టాడు.

“రీసెంట్ గానే దిల్ రాజు ఓసారి నాతో అన్నారు. తెల్లారి 4 గంటలకు ఓ ఐడియా వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు పార్ట్-2 చేద్దాం, ప్రిపేర్ అయిపోమన్నారు. ఆ సినిమాకు పార్ట్-2 చేస్తే బాగుంటుందని దిల్ రాజు ఫీల్ అయ్యారు. మళ్లీ ఆ కాంబినేషన్ కుదరాలి. ఆ క్రేజ్ ను కొనసాగించాలంటే దానికి తగ్గ కథ సెట్ అవ్వాలి. కథ ఏమైనా వర్కవుట్ అయితే చెబుతానని అన్నాను.”

ఇలా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సీక్వెల్ పై స్పందించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. పెదకాపు-1 సినిమా ప్రమోషన్ లో భాగంగా గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన ఈ దర్శకుడు..  సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో సీక్వెల్ చేయగల స్టఫ్ ఉందన్నారు.

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ఉద్దేశం ఏంటంటే.. ఓ మంచి ఫ్యామిలీని చూపించాలి, మంచి ఆలోచనలుండాలి, సంస్కారం చూపించాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అక్కడివరకే ఆ కథ అనుకొని, అక్కడితో ఆపేశాను. దానికి కొనసాగింపు ఉంటుంది కదా అంటున్నారు దిల్ రాజు. అది నిజమే. నా కంటే లోతుగా దిల్ రాజు ఆలోచిస్తున్నారు.”

అప్పట్లో మహేష్-వెంకీతో కలిసి ఆ సినిమా చేయడానికి తనకు నాలుగేళ్లు పట్టిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లిద్దర్నీ కలిపి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు పార్ట్-2 తీయడం సాధ్యమౌతుందా అవ్వదా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు అడ్డాల.