ఆ హీరోయిన్ల సాన్నిహిత్యం కోసం కూడా అత‌డి ప్లాన్!

వ‌య‌సు 32 యేళ్లే అయినా సుమారు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల పై చిలుకు మోసానికి సంబంధించిన కేసుల్లో జైలు పాలైన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కు సంబంధించిన లీల‌ల‌ను వెలుగులోకి తీసుకు వ‌స్తోంది ఎన్…

వ‌య‌సు 32 యేళ్లే అయినా సుమారు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల పై చిలుకు మోసానికి సంబంధించిన కేసుల్లో జైలు పాలైన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కు సంబంధించిన లీల‌ల‌ను వెలుగులోకి తీసుకు వ‌స్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్. 

ఇప్ప‌టికే సుఖేష్ ను విచారిస్తూ..అత‌డు ఆ డ‌బ్బును ఎలా ఖర్చు చేశాడ‌నే అంశంపై ఈడీ నివేదిక‌ల‌ను త‌యారు చేసింది. వాటి ప్ర‌కారం అత‌డు ఎక్కువ మొత్తాన్నిజ‌ల్సాల కోస‌మే ఖ‌ర్చు చేశాడు. ప్ర‌త్యేకించి హీరోయిన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని, వారి కోసంఎడా పెడా డ‌బ్బును ఖ‌ర్చు పెట్టాడ‌ని ఈడీ ఇది వ‌ర‌కే పేర్కొంది.

సుఖేష్ స‌న్నిహితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు ప‌లుసార్లు వినిపించింది. ఆమె, ఆమె కుటుంబీకుల కోసం సుఖేష్ భారీ మొత్తాన్ని ఖ‌ర్చు చేశాడ‌ని ఈడీ పేర్కొంది. అలాగే మ‌రో న‌టి నోరా ఫ‌త్హే కు కూడా ఇత‌డు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టినట్టుగా ఈడీ నిర్ధారించింది.

ఇక సుఖేష్ గురించి ఈడీ ప‌రిశోధ‌న‌కు సంబంధించి మ‌రో విష‌యం వినిపిస్తోందిప్పుడు. సుఖేష్ హిట్ లిస్టులో మ‌రింత‌మంది హీరోయిన్లు ఉన్నార‌ని ఈడీకి తెలిసింద‌ట‌. పాపుల‌ర్ న‌టీమ‌ణుల‌కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి వారి సాన్నిహిత్యం కోసం ఈ సుఖ పురుషుడు త‌పించాడ‌ని అంద‌రికీ అర్థం అవుతూ ఉంది. ఈ విష‌యంలో జాక్వెలిన్, నోరా మాత్ర‌మే కాద‌ట‌. ఇత‌డి టార్గెట్ లు వేరే కూడా ఉన్నార‌ట‌.

వారి కోసం కూడా ఇత‌డు ఎత్తులు వేస్తూ ఉండ‌గానే దొరికిపోయిన‌ట్టుగా ఉన్నాడు. జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్, భూమీ పెడ్నేక‌ర్ ల‌ను కూడా టార్గెట్ గా పెట్టుకుని సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ఎత్తులు వేసిన‌ట్టుగా ఈడీ విచార‌ణ‌లో తేలిన‌ట్టుగా స‌మాచారం. డ‌బ్బు ఖర్చు పెట్టి వారికి కూడా ద‌గ్గ‌ర‌య్యే ఎత్తుగ‌డ‌ల‌ను ఇత‌డు వేసిన‌ట్టుగా ఈడీ నిర్ధారించిన‌ట్టుగా తెలుస్తోంది.

మోసాల ద్వారా భారీ మొత్తాల‌ను సంపాదించి, సినిమా హీరోయిన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ఈ చిత్ర‌మైన మోస‌గాడి గురించి సినిమానే తీయ‌డానికి త‌గినంత స‌రంజామాను బ‌య‌ట‌కు తీస్తున్న‌ట్టుగా ఉంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్!