కొత్త ట్విస్ట్: సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాపై కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు కొద్దిసేపటి కిందట కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా సుశాంత్ తల్లిదండ్రులు బయటకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా…

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు కొద్దిసేపటి కిందట కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా సుశాంత్ తల్లిదండ్రులు బయటకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు.

స్వయంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్, పాట్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రియాపై కంప్లయింట్ ఇచ్చారు. సుశాంత్ ను రియా ఆర్థికంగా మోసం చేసిందని, ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించిందని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

సుశాంత్ మరణంపై ముంబయి పోలీసులు ఓవైపు దర్యాప్తు చేస్తున్న వేళ.. ఆ రిజల్ట్ కోసం వేచిచూడాలా, లేక ప్రత్యేకంగా మరో ఫిర్యాదు చేయాలా అనే విషయంపై కుటుంబ సభ్యులంతా చర్చించి.. ఇలా రియాపై ఫిర్యాదుచేయాలని నిర్ణయించినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

ఉన్నఫలంగా సుశాంత్ తండ్రి ఇలా రియాపై కేసు పెట్టడంపై చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా 2 విషయాలు చెప్పుకోవాలి. సుశాంత్ నుంచి బ్రేకప్ అయిన రియాపై తమకు ఎలాంటి కోపం, అనుమానం లేదని స్వయంగా కేకే సింగ్ గతంలో ప్రకటించారు. సుశాంత్ చనిపోయిన తర్వాత రియా వచ్చి తమను పరామర్శించినట్టు కూడా స్పష్టంచేశారు. ఇలా రియా గురించి మంచిగా మాట్లాడిన కేకే సింగ్ ఇప్పుడు ఆమెపైనే ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరం.

రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాట్నా పోలీసులు.. నలుగురు పోలీసుల్ని ముంబయికి పంపించబోతున్నారు. వారు సుశాంత్ డైరీలో వివరాలతో పాటు.. ముంబయి పోలీసుల నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. 

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది