Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుశాంత్ నన్ను ఫుల్ గా వాడుకొని ఇలా బుక్ చేశాడు

సుశాంత్ నన్ను ఫుల్ గా వాడుకొని ఇలా బుక్ చేశాడు

మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది ఆమె ప్రియురాలు రియా చక్రబొర్తి. సుశాంత్ తనను ఫుల్ గా వాడుకున్నాడని, అతడి వల్ల ఇప్పుడిలా తను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ప్రకటించింది. బెయిల్ కోసం ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రియా.. అందులో సుశాంత్ కు సంబంధించి కొన్ని వివరాలు పొందుపరిచింది.

"సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉంది. అతడి సర్కిల్ లో డ్రగ్స్ తీసుకునేది అతనొక్కడే. డ్రగ్స్ తీసుకురావాలని తన స్టాఫ్ ను బలవంతం చేసేవాడు. నన్ను, నా సోదరుడు షోవిక్ ను కూడా డ్రగ్స్ కోసం ఫుల్ గా వాడుకున్నాడు. అతడు ఎలాంటి ఆధారాలు మిగల్చలేదు. మేం మాత్రం దొరకిపోయాం."

నిజంగా సుశాంత్ జీవించి ఉంటే.. మాదకద్రవ్యాలు తీసుకున్న కేసులో చాలా చిన్న శిక్షతో బయటపడేవాడని రియా తన పిటిషన్ లో పేర్కొంది. చాలా తక్కువ మోతాదులు సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడని, మహా అయితే ఏడాది జైలు శిక్షతో అది ముగిసేదని తెలిపింది.

ఆత్మహత్యకు 3 రోజుల ముందు సుశాంత్ తన వంటవాడు నీరజ్ కు డ్రగ్స్ రెడీ చేసి పెట్టాల్సిందిగా ఆదేశించాడట. గంజా జాయింట్స్, రోల్స్, డూబీస్ రెడీ చేసి తన బాక్స్ లో పెట్టాలని చెప్పాడట. నీరజ్ ఆ మేరకు అవన్నీ రెడీ చేసి సుశాంత్ బెడ్ రూమ్ లోని ఓ బాక్స్ లో పెట్టాడట. సుశాంత్ మరణించిన రోజు, నీరజ్ ఆ బాక్స్ తెరిచి చూస్తే అది ఖాళీగా ఉందట. సో.. చనిపోవడానికి ముందు సుశాంత్ ఆ మాదకద్రవ్యాలు తీసుకున్నాడని నీరజ్.. సీబీఐ విచారణలో చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి.

మరోవైపు తన 47 పేజీల బెయిల్ పిటిషన్ లో విచారణ ఏజెన్సీలపై మరో ఆరోపణ కూడా చేసింది రియా. సుశాంత్ కు సంబంధించిన ఒక్క ఫోన్ కాల్ లేదా మెసేజ్ లేదా వాట్సాప్ ఛాట్ ఎందుకు బయటకు రాలేదని ఆమె తన పిటిషన్ లో ప్రశ్నించారు. కేవలం తనను, తన సోదరుడ్ని ఇరికించేందుకు ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

రియా బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగలేదు. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా.. ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?