Advertisement

Advertisement


Home > Movies - Movie News

సైరాలో రెండుసార్లు పవన్ వాయిస్

సైరా సినిమాలో రెండుసార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సినిమా ప్రారంభంలో పవన్ వాయిస్ వుంటుందని ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే చివరిలో మళ్లీ ఆయన మాటలు వుంటాయని, దేశంకోసం అహరహం తపించే పవన్ కళ్యాణ్ చెబితేనే ఆ మాటలు జనాల్లోకి వెళ్తాయని భావించి, చెప్పించామని ఆయన అన్నారు.

సైరా సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ మాట్లాడుతూ సైరా సినిమా యూత్ కు ఎక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసినవారు లేకపోలేదని, కానీ ఈ సినిమా ముమ్మాటికీ యూత్ సినిమా అని, పాటలు, ఫైట్లు వుంటేనే యూత్ ఫిల్మ్ కాదని, దేశం అంటే ఇష్టపడే యువతకు నచ్చే సినిమా కూడా యూత్ ఫిల్మ్ నే అని ఆయన అన్నారు.

సైరా సినిమాను ఎంత ఖర్చవుతుంది, ఎంత లాభం వస్తుంది లాంటి లెక్కలు వేసుకుని తీయలేదని, ఓ మంచి సినిమాగా మిగిలిపోవాలని తపించి తీసామని, విదేశాల్లో తీసిన ఒక్క వార్ ఎపిసోడ్ కే 70కోట్లకు పైగా ఖర్చయిందని ఆయన చెప్పారు. ఎప్పటికైనా ఓ చరిత్రకెక్కిన వీరుడి పాత్ర పోషించాలని దశాబ్దాల కాలంగా తపిస్తున్నానని, ఏ డైరక్టర్, ఏ నిర్మాత అలాంటి పాత్రను తన దగ్గరకు తీసుకురాలేదని ఆయన చెప్పారు. అలాంటి నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ దశాబ్దకాలం కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకువచ్చారని, ఈ పాత్ర మీరు మాత్రమే చేయాలి అని చెప్పారని అన్నారు.

ఆ కల ఇప్పటికి తీరిందని, వాస్తవానికి తననే దర్శకత్వం చేయమని పరుచూరి బ్రదర్శ్ కోరారని, అయితే నటన, దర్శకత్వం ఒకటే చేయగలనని, అలా అయితే హీరోగా మానేస్తానని అన్నానని, అయితే వేరే డైరక్టర్ ను చూడడం, మీరే వేయాలని వారు అన్నారని చెప్పారు. అప్పుడు డైరక్టర్ వేట మొదలుపెట్టామని వెల్లడించారు.

సైరా నిర్మాణానికి ధైర్యాన్ని ఇచ్చింది దర్శకుడు రాజమౌళి అని, సరైన సినిమా ఎంత ఖర్చుపెట్టి తీసినా అంతకు అంతా వస్తుందిన ఆయన తన బాహుబలి సినిమాతో రుజువుచేసి, భరోసా ఇచ్చారని, అందువల్ల సైరా నిర్మాణంలో ఎంత ఖర్చుకు అయినా తెగించి ముందుకు వెళ్లగలిగామని చిరంజీవి అన్నారు.

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?