నంద‌మూరి అభిమానుల్ని భ‌య‌పెడుతున్న తార‌క‌ర‌త్న ఆరోగ్యం!

నంద‌మూరి అభిమానుల్ని తార‌క‌ర‌త్న ఆరోగ్యం భ‌య‌పెడుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. దీంతో బెంగ‌ళూరులో చికిత్స పొందుతున్న నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు చేరుకుంటున్నార‌ని స‌మాచారం.  Advertisement గ‌త…

నంద‌మూరి అభిమానుల్ని తార‌క‌ర‌త్న ఆరోగ్యం భ‌య‌పెడుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. దీంతో బెంగ‌ళూరులో చికిత్స పొందుతున్న నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు చేరుకుంటున్నార‌ని స‌మాచారం. 

గ‌త నెల 27న కుప్పంలో లోకేశ్ పాద‌యాత్ర‌లో మొద‌టి రోజు తార‌క‌ర‌త్న పాల్గొన్నారు. పాద‌యాత్ర‌లో తీవ్ర గుండెపోటుకు ఆయ‌న గురయ్యారు. దీంతో తార‌క‌ర‌త్న‌కు వెంట‌నే కుప్పంలో వైద్య సేవ‌లు అందించారు. అనంత‌రం ఆయ‌న్ను బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యా ల‌య ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

విదేశీ వైద్య నిపుణులు సైతం వ‌చ్చి ఆయ‌న‌కు చికిత్స చేస్తున్నారు. తార‌క‌ర‌త్న కోలుకుంటున్నార‌నే వార్త‌లో మ‌ధ్య‌లో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు తాజాగా వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యులు బెంగ‌ళూరు చేరుకున్న‌ట్టు స‌మాచారం. ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై బులెటిన్ విడుద‌ల చేస్తామ‌ని నారాయ‌ణ హృద‌యాల‌య వైద్యులు వెల్ల‌డించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లోనూ, నంద‌మూరి అభిమానుల్లోనూ ఆందోళ‌న నెల‌కుంది. ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందో అనే భ‌యం వారిని వెంటాడుతోంది.