త్రివిక్రమ్ చల్లని చూపు.. తమన్ కు మళ్లీ ఛాన్స్

అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ ను ఫ్లాట్ చేసి పడేశాడు తమన్. దీంతో తన సినిమాలతో పాటు తనకు తెలిసిన సినిమాలకు కూడా తమన్ పేరునే సిఫార్సుచేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ క్రమంలో మరో క్రేజీ…

అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ ను ఫ్లాట్ చేసి పడేశాడు తమన్. దీంతో తన సినిమాలతో పాటు తనకు తెలిసిన సినిమాలకు కూడా తమన్ పేరునే సిఫార్సుచేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ కొట్టేశాడు ఈ సంగీత దర్శకుడు.

పవన్ కల్యాణ్, రానా హీరోలుగా ఈరోజు కొత్త సినిమా లాంఛ్ అయింది. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఇది. ఇప్పుడీ ప్రాజెక్టు కూడా తమన్ చేతికే వచ్చింది. కేవలం త్రివిక్రమ్ రిఫరెన్స్ తోనే తమన్ కు ఈ మూవీ ఛాన్స్ వచ్చింది. ఈ రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సినిమాకు తమనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు పవన్ నెక్ట్స్ మూవీకి కూడా సంగీతం అందించే ఛాన్స్ ఇతడ్నే వరించింది.

ఇక అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ విషయానికొస్తే… సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. 

మూవీలో పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. వీళ్ల పేర్లను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. 

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?