Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో త‌ల్లి షాక్‌కు గురి చేసిందంటున్న హీరోయిన్‌

హీరో త‌ల్లి షాక్‌కు గురి చేసిందంటున్న హీరోయిన్‌

ఓ హీరో త‌ల్లి త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని హీరోయిన్ ప్రియ‌మ‌ణి పాత విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. కేర‌ళ‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు ద‌క్షిణాది హీరోయిన్‌గా అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2006 లో  జాతీయ ఉత్తమ నటి పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషా చిత్రాల్లో న‌టించారు. రావణ్ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు.

ప్ర‌స్తుతం ఆమె విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా న‌టిస్తున్న నారప్ప  మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌పై వచ్చిన ప్రేమ ప్ర‌చారానికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. ఓ హీరో త‌ల్లి త‌న‌ను అడిగిన ఓ ప్ర‌శ్న షాక్‌కు గురి చేసిన‌ట్టు వివ‌రించారు. ఆ వివ‌రాలేంటో తెలుసుకుందాం.

నవ వసంతం సినిమాలో  హీరో తరుణ్‌కు జంట‌గా  ప్రియమణి న‌టించారు. 2005లో ఈ సినిమా షూటింగ్ జ‌రిగింది. షూటింగ్ స‌మ‌యంలో త‌రుణ్‌తో త‌న‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్టు ప్రియ‌మ‌ణి తెలిపారు. ఆ ప‌రిచ‌యంతో చాలా సార్లు లంచ్‌, డిన్న‌ర్‌కు క‌లిసి వెళ్లిన‌ట్టు చెప్పారామె. దీంతో స‌హ‌జంగానే త‌మ‌ద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఇండ‌స్ట్రీలో చెవులు కొరుక్కోవ‌డం స్టార్ట్ అయింద‌న్నారు.

త‌మ మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతున్న‌ట్టు త‌రుణ్ ఇంట్లో కూడా న‌మ్మార‌న్నారు. ఓ రోజు షూటింగ్‌లో ఉండ‌గా త‌రుణ్ వాళ్ల అమ్మ రోజా ర‌మ‌ణి వ‌చ్చార‌న్నారు. త‌న‌తో మాట్లాడుతూ ప్రేమ ప్ర‌స్తావ‌న తెచ్చార‌న్నారు. "త‌రుణ్‌, మీరు ప్రేమించుకున్న‌ట్టు తెలిసింది. నీకు ఇష్ట‌మైతే నా కుమారుడిని పెళ్లి చేసుకో" అని ఆమె కోరార‌న్నారు. త‌రుణ్ త‌ల్లి నోట ఆ మాట‌లు విన్న క్ష‌ణాన షాక్ కొట్టిన‌ట్టైంద‌న్నారు.    

అయితే తరుణ్‌తో త‌న‌ది కేవలం స్నేహ బంధం మాత్రమేని స్ప‌ష్ట‌త ఇచ్చాన‌న్నారు. తమని  అపార్థం చేసుకున్నారని ఆమెతో అన్న‌ట్టు నాటి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నారు. కాగా   ప్రియమణి 2017లో ముస్తాఫ్‌ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె సినిమాల్లో న‌టిస్తూనే ఉన్నారు. 

నిమ్మగడ్డకు నిఖార్సైన ప్రశ్న

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?