ద‌క్షిణాదిలో అంద‌ర్నీ సంతృప్తి ప‌ర‌చాలిః స్టార్ హీరోయిన్‌

ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చాక ప్రేక్ష‌కుల అభిరుచుల్లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అభిప్రాయ‌ప‌డ్డారు. వెండితెర‌, బుల్లితెర‌తో పాటు డిజిట‌ల్ వేదిక‌ల‌పై స‌త్తా చాటుతున్న స‌మంత మామ‌ను మించిన కోడ‌లిగా పేరు…

ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చాక ప్రేక్ష‌కుల అభిరుచుల్లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అభిప్రాయ‌ప‌డ్డారు. వెండితెర‌, బుల్లితెర‌తో పాటు డిజిట‌ల్ వేదిక‌ల‌పై స‌త్తా చాటుతున్న స‌మంత మామ‌ను మించిన కోడ‌లిగా పేరు తెచ్చుకున్నారు. 

ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ముఖ ఓటీటీ వేదిక ఆహా కోసం స్పెష‌ల్ టాక్‌షో నిర్వ‌హిస్తూ ఓహో అనిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల అభిరుచుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. 

బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు ఎలాంటి పాత్ర‌ల్లో న‌టించినా ప్రేక్ష‌కులు చూస్తార‌న్నారు. కానీ టాలీవుడ్‌లో ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. బాలీవుడ్‌లో కేవ‌లం ఒక్క జోన‌ర్ ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే స్వేచ్ఛ ఉంద‌న్నారు. అక్క‌డ ప్రేక్ష‌కులంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అదే ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్లో విభిన్న ఆలోచ‌నలు, అభిరుచులు క‌నిపిస్తాయ‌న్నారు. ప్ర‌తి ప్రేక్ష‌కుడిని దృష్టిలో పెట్టుకుని సినిమాల‌ను తెర‌కెక్కించాల్సిన ప‌రిస్థితి ఇక్క‌డ ఉంద‌న్నారు. అయితే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లు వ‌చ్చిన త‌ర్వాత ద‌క్షిణాది ప్రేక్ష‌కుల అభిరుచుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని ఆమె చెప్పుకొచ్చారు.   

ఏడాదిగా అవే జెండాలూ, అవే మొహాలూ