విశ్వంభర హీరోయిన్ వచ్చేసింది

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సెట్స్ లో అడుగుపెట్టిన త్రిషకు సాదరంగా స్వాగతం పలికే…

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సెట్స్ లో అడుగుపెట్టిన త్రిషకు సాదరంగా స్వాగతం పలికే వీడియోను విడుదల చేశారు. 

రీసెంట్ గా చిరంజీవి సెట్స్ పైకి వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ త్రిష కూడా అడుగుపెట్టడంతో, విశ్వంభర షూటింగ్ వేగం పుంజుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా 13 సెట్స్ నిర్మిస్తున్నారు. అందులోని ఓ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. 

చిరు-త్రిష కలిసి సినిమా చేయడం ఇది రెండో సారి. ఇంతకుముందు ఇద్దరూ కలిసి స్టాలిన్ మూవీలో నటించారు. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. 

రీఎంట్రీలో త్రిష అదరగొడుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత కోలీవుడ్ లో విజయ్ తో లియో చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. కెరీర్ లో ఆమె పీక్ స్టేజ్ లో ఉంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో చోటుంది. వాళ్లు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది విశ్వంభర. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఆల్రెడీ బిజినెస్ కూడా మొదలైంది. ఓవర్సీస్ డీల్ ఇప్పటికే లాక్ అయింది. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా ఓకే అయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దాదాపు దక్కించుకుంది.