Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తాం

త్రివిక్రమ్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తాం

దర్శకుడు త్రివిక్రమ్ తో బడ్జెట్ బారియర్స్ లేని, ప్రపంచం అంతా అటు తిరిగి చూసేలాంటి ఓ బృహత్తర ప్రాజెక్టు చేసే ఆలోచన, కోరిక వుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత, హారిక హాసిని సంస్థ నిర్వాహకుడు సూర్యదేవర నాగవంశీ అన్నారు. 

స్వాతిముత్యం సినిమా విడుదల సందర్భంగా గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ సినిమా త్రివిక్రమ్ తో చేయాలన్నది తన కోరిక అన్నారు. అది ఎలాంటి సినిమా, ఎవరితో సినిమా అన్నది ఆ టైమ్ వచ్చినపుడు డిసైడ్ చేస్తామన్నారు.

ఇకపై అన్నీ మిడ్ రేంజ్ కమర్షియల్ సినిమాలే ప్లాన్ చేస్తున్నామని, దాదాపు అందరు హీరోలతో సినిమాలు వుంటాయని వెల్లడించారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రభాస్, రామ్ చరణ్ లతో చెరో సినిమా చేసే ఆలోచన వుందన్నారు. మహేష్ బాబు సినిమా కొత్తగా వుంటుందని నాగవంశీ తెలిపారు. ఈ సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో వుంటుందన్నది ఇంకా అంచనా లేదన్నారు.

తాము వెళ్లి ఎవరినీ సినిమా చేయమని అడగమని, అలాగే పెద్ద దర్శకులు ఎవ్వరూ తమ దగ్గరకు రాలేదని, అన్నీ సెట్ అయితే ఎవరితో అయినా సినిమా చేస్తానని చెప్పారు. స్వాతిముత్యంలో స్పెర్మ్ డొనేషన్ అనే కొత్త పాయింట్ ను డిస్కస్ చేసామని, అది ఫ్యామిలీ అంతా కలిసి కూడా చూసే విధంగా వుంటుందని అన్నారు.  

ఈ మధ్యకాలంలో అస్సలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు రాలేదని, ఆ లోటును స్వాతిముత్యం తీరుస్తుందని అనుకుంటున్నామన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?