తానెంత జాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడినట్టు ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా సెకెండ్ వేవ్లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు దాని బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు సురక్షితంగా బయట పడ్డారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఆండ్రియా తాను కరోనాబారిన పడినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ తదితర చిత్రాలతో ఆండ్రియా టాలీవుడ్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తనకు కరోనా నిర్ధారణ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
‘కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అయినప్పటికీ ఆ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయాను. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను క్షేమంగానే ఉన్నాను. మీరంతా కూడా ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆండ్రియా చెప్పుకొచ్చారు.
ఆండ్రియా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోజులు గడిచేకొద్ది ఒక్కొక్కరుగా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.