వైష్ణవ్-రకుల్-వింటేజ్ సాంగ్

లేటెస్ట్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కలిసి చేస్తున్న సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. కరోనా తగ్గుముఖం పడుతోంది అనగానే డైరక్టర్ క్రిష్ ఇలా స్టార్ట్ చేసి, మిగిలిన వాళ్లు…

లేటెస్ట్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కలిసి చేస్తున్న సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. కరోనా తగ్గుముఖం పడుతోంది అనగానే డైరక్టర్ క్రిష్ ఇలా స్టార్ట్ చేసి, మిగిలిన వాళ్లు ఆలోచించే లోగానే సినిమాను ఫినిష్ చేసారు.

ఆ విషయంలో క్రిష్ ను హ్యాట్సాఫ్ అనాల్సిందే. వికారాబాద్ అడవుల్లోనే మొత్తం సినిమా షూట్ చేసిన తరువాత బ్యాలన్స్ పాటను హైదరాబాద్ డాక్ హవుస్ దగ్గర ఇప్పుడు పిక్చరైజ్ చేస్తున్నారు.

ఇందుకోసం ఓ ఓల్డ్ గిరిజన గూడెం సెట్ ను భారీగా వేసారు. అడవుల నేపథ్యం, గుడిసెలు, ఆ ఆంబియన్స్ అంతా ప్రతిబింబించేలా సెట్ వేసి అందులో రకుల్-వైష్ణవ్ ల మీద సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. కీరవాణి ఇచ్చిన ట్యూన్ తో పాట తయారైంది. 

సినిమా మొత్తం ఈ నెలాఖరుకల్లా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా రెడీ అవుతుంది. కేవలం సిజి వర్క్ మాత్రమే పెండింగ్ వుంటుంది. డిసెంబర్ లో అది కూడా పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి సినిమాను దింపాలనే ఆలోచనలో వున్నారు నిర్మాత కమ్ దర్శకుడు క్రిష్.

సీమలో టీడీపీకి దిక్కెవరు?