బాలీవుడ్ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత!

బాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌మీర్ ఖాఖ‌ర్(71) క‌న్నుమూశారు. శ్వాసకోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయన నిన్న ఉద‌యం ఆస్ప‌త్రిలో చేరారు. ఇవాళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.…

బాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌మీర్ ఖాఖ‌ర్(71) క‌న్నుమూశారు. శ్వాసకోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయన నిన్న ఉద‌యం ఆస్ప‌త్రిలో చేరారు. ఇవాళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన పుష్ప‌క విమానం, స‌ల్మాన్ ఖాన్ జై హో, ప‌రిందా, మ‌సూమ్, రాజా బాబు వంటి అనేక హిట్ చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. స‌మీర్ గుజ‌రాతీ నాట‌కాల‌తో సినీ జీవితాన్ని ప్రారంభించిన నుక్క‌డ్ అనే టీవీ షో ద్వారా మంచి పేరు సంపాధించుకున్నారు. నుక్క‌డ్ టీవీ షోతో గుర్తింపు పొందిన స‌మీర్… షారుఖ్ ఖాన్ న‌టించిన స‌ర్క‌స్ సీరియ‌ల్ లోనూ న‌టించారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నాటకరంగ, టీవీ, సినీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. 1996లో అమెరికాలో స్థిరపడిన ఆయ‌న‌ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి.. స‌ల్మాన్ ఖాన్ జై హో సినిమాలో న‌టించారు.