కూతురు మరణం నుంచి ఆ హీరో కోలుకున్నట్టేనా?

రీసెంట్ గా తన కూతుర్ని కోల్పోయాడు విజయ్ ఆంటోనీ. అతడి కూతురు మీరా, డిప్రెషన్ కు తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ టైమ్ లో విజయ్ ఆంటోనీని ఓదార్చడం ఎవ్వరితరం…

రీసెంట్ గా తన కూతుర్ని కోల్పోయాడు విజయ్ ఆంటోనీ. అతడి కూతురు మీరా, డిప్రెషన్ కు తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ టైమ్ లో విజయ్ ఆంటోనీని ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు. కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన ఈ హీరో, తన కూతురితో పాటు తను కూడా చచ్చిపోయానంటూ ట్వీట్ పెట్టాడంటే, అతడి పెయిన్ ను అర్థం చేసుకోవచ్చు.

అయితే ఎన్నాళ్లిలా..? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఈ హీరో, తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడు? నెక్ట్స్ అతడి నుంచి వచ్చే సినిమా ఏంటి? దీనికి సమాధానం దొరికింది. విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రం కోసం బయటకొచ్చాడు.

విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం రత్తం. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. ఇప్పటికే ట్రయిలర్ రిలీజైంది. నందితా శ్వేత, మహిమా నంబియార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రచారంలో విజయ్ ఆంటోనీ పాల్గొన్నాడు.

పెద్ద కూతుర్ని కోల్పోయిన బాధలో ఉన్న విజయ్ ఆంటోనీ తన చిన్న కూతురు లారాతో కలిసి ఈ ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ ఆంటోనీ, బాధతో జీవించడం అలవాటు చేసుకుంటున్నానని చెప్పడం అందర్నీ కలచివేసింది.

“జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇలాంటి తీవ్రమైన అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని నేర్చుకుంటాం. బాధతో బతకడం నేర్చుకుంటున్నాను. నేను గతాన్ని మరిచిపోను. అది నన్ను మానసికంగా మరింత బలవంతంగా మారుస్తుంది. నేనేమీ తత్వవేత్తను కాదు.”

ఇలా తన బాధను వ్యక్తం చేశాడు విజయ్ ఆంటోనీ. కూతురు చనిపోయిన రోజుల వ్యవథిలోనే సినిమా ప్రచారం కోసం, తన బాధనంతా దిగమింగుకొని అతడు మీడియా ముందుకు రావడాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ప్రచారానికి రావడానికే ఇబ్బంది పడే చాలామంది హీరోలు, విజయ్ ఆంటోనీని చూసి నేర్చుకోవాలంటున్నారు.