విజ‌య్ దగ్గరకు రామ్ చరణ్ స్టోరీ

ఇవ్వాళ రేపు దర్శకులు, హీరోలు దొరకడమే కష్టంగా వుంది. అలా దొరికినా కథలు చెప్పి ఒప్పించడం ఇంకా కష్టంగా వుంది.  Advertisement గౌతమ్ తిన్ననూరి ని రామ్ చరణ్ ను ఓ దగ్గరకు చేర్చారు…

ఇవ్వాళ రేపు దర్శకులు, హీరోలు దొరకడమే కష్టంగా వుంది. అలా దొరికినా కథలు చెప్పి ఒప్పించడం ఇంకా కష్టంగా వుంది. 

గౌతమ్ తిన్ననూరి ని రామ్ చరణ్ ను ఓ దగ్గరకు చేర్చారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, యువ వంశీ కలిపి. కానీ కథ విషయంలో రామ్ చరణ్ ఓకె అనలేకపోయాడు. దాంతో ఆఖరికి అదే కథ పట్టుకుని గౌతమ్ నేరుగా విజ‌య్ దేవరకొండ దగ్గరకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యువి తో సంబంధం లేకుండా ఎన్వీ ప్రసాద్ నే ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం చేస్తున్న ఖుషీ సినిమా తరువాత విజ‌య్ ఈ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ నిర్మాణ బాధ్యతలు చూసి, ఎన్వీ ప్రసాద్ మంచి లాభాలు సంపాదించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు టేకప్ చేసారు.

ఇంతకీ రామ్ చరణ్ కు గౌతమ్ ఏ తరహా కథ చెప్పారు, అతగాడి అభ్యంతరాలు ఏమిటి? ఎందుకు వాటికి తగిన మార్పులు చేయలేకపోయారు. మరి అదే కథ విజ‌య్ కు ఎలా నచ్చింది అన్న అప్ డేట్ లు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు వున్నాయి.