విక్రమ్..బ్రేక్ ఈవెన్ దిశగా

వర్డ్ ఆఫ్ మౌత్ తో కమల్ హాసన్ మల్టీ స్టారర్ విక్రమ్ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఆంధ్ర, నైజాం రెండింటిలో నాలుగు రోజుల పాటు మంచి ఫలితాలు నమోదు చేసింది. సోమవారం కూడా…

వర్డ్ ఆఫ్ మౌత్ తో కమల్ హాసన్ మల్టీ స్టారర్ విక్రమ్ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఆంధ్ర, నైజాం రెండింటిలో నాలుగు రోజుల పాటు మంచి ఫలితాలు నమోదు చేసింది. సోమవారం కూడా స్టడీగా వుండడం, ఆంధ్రలో చాలా చోట్ల ఫుల్స్ రావడం విశేషం. 

ఉత్తరాంధ్ర ఏరియాకు కోటి రూపాయలకు విక్రయిస్తే తొలి నాలుగు రోజుల్లోనే 98 లక్షల మేరకు షేర్ వచ్చింది. కృష్ణా గుంటూరు కలిపి కోటి ఎనిమిది లక్షలకు చేస్తే…నాలుగు రోజుల్లో 95 లక్షల వరకు షేర్ వచ్చింది. ఈస్ట్ నాలుగు రోజులకు 38 లక్షలు, వెస్ట్ 21 లక్షలు షేర్ వసూలు చేసింది.

సీడెడ్ ఏరియా కోటి రూపాయలకు విక్రయిస్తే తొలి నాలుగు రోజుల్లోనే 90 లక్షలు షేర్ రాబట్టింది. నైజాం ఏరియాను కొటి రూపాయల బర్డెన్ కు బయ్యర్లే వుంచుకున్నారు. అక్కడ నాలుగు రోజులకు రెండో కోట్ల అరవై లక్షలు వసూలు చేసింది.

టోటల్ గా మాంచి లాభాల ప్రాజెక్ట్ గా మారింది విక్రమ్. యాభై కోట్ల సినిమాకు అయిదు కోట్లు మిగలడం కష్టం అవుతున్న రోజుల్లో ఆరు కోట్లకు కొన్న సినిమాకు ఇప్పటికే కోటిన్నర లాభం కనిపిస్తోంది.