విరూపాక్ష.. మొదటి రోజు రూ.12 కోట్లు

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష నిన్న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు, మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. సాయితేజ్ కెరీర్ లోనే బెస్ట్…

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష నిన్న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు, మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. సాయితేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది విరూపాక్ష.

విరూపాక్ష సినిమాకు మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి తొలి రోజు ఈ సినిమాకు అటుఇటుగా 5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

విరూపాక్ష సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో, ఈరోజు నుంచి వసూళ్లు మరింత పెరగనున్నాయి. దీనికి నిదర్శనంగా ఆన్ లైన్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది విరూపాక్ష.

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులు ఆశించిన థ్రిల్ ను అందించింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయిచంద్, సునీల్, రాజీవ్ కనకాల, సోనియా సింగ్ కీలక పాత్రలు పోషించారు.

యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష. దీంతో ఈ మూవీ సక్సెస్ పై మెగా కాంపౌండ్ చాలా హోప్స్ పెట్టుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన వెంటనే చిరంజీవి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్, తన మేనల్లుడికి పుష్పగుచ్ఛం పంపించారు.