వియ్యమందుకుంటున్న పెద్ద కుటుంబాలు?

టాలీవుడ్‌ లో రెండు పెద్ద కుటుంబాలు వియ్య మందుకుంటున్నాయని విశ్వసనీయ వర్గాల బోగట్టా. రెండు పెద్ద కుటుంబాలు సంబంధం కలుపుకోబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు తెలుస్తున్న వార్తలు నిజమైతే రెండు మంచి పేరున్న కుటుంబాలు…

టాలీవుడ్‌ లో రెండు పెద్ద కుటుంబాలు వియ్య మందుకుంటున్నాయని విశ్వసనీయ వర్గాల బోగట్టా. రెండు పెద్ద కుటుంబాలు సంబంధం కలుపుకోబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు తెలుస్తున్న వార్తలు నిజమైతే రెండు మంచి పేరున్న కుటుంబాలు ఒక్కటి కాబోతున్నట్లే. 

తెలుగు సినిమా ప్రతిష్టను ఆస్కార్ లెవ‌ల్ తీసుకెళ్లిన కుటుంబం ఒకటి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సినిమాలు, డీలర్ షిప్ ల ఇలా అన్ని విధాలా కాకలు తీరి, అందరితోనూ సన్నిహిత సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబం మరొకటి. ఈ రెండు వియ్యం అందుకోబోతున్నాయి.

సంగీత దర్శకుడు కీరవాణి ఒకరు. నటుడు ఆల్ అండ్ ఆల్ అనిపించే మురళీమోహన్ మరొకరు. మురళీ మోహన్ ఒక్కగానొక్క కొడుకు కు ఒకరే కుమార్తె. అంటే మురళీ మోహన్. మనుమరాలు. రూపా మాగంటి కుమార్తె. మురళీ మోహన్. మనుమరాలును కీరవాణి రెండో కుమారుడు, హీరో సింహాకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కన్ ఫర్మ్ చేయాల్సింది ఆ కుటుంబాలే. కానీ ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు జస్ట్ మాటలు మాత్రమే జరిగాయని, పెళ్లి వచ్చే ఏడాది వుంటుందని తెలుస్తోంది. వేల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన మురళీమోహన్ మనమరాలు చాలా అందంగా వుంటారని, ఆమెకు కీరవాణి కుమారుడు సింహా అంటే చాలా ఇష్టం అని ఆ వర్గాలు తెలిపాయి. సింహా కూడా చక్కగా వుంటాడు. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.